బీజింగ్: మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపును చైనా మూసివేసింది. విజిటర్స్ కోసం బేస్ క్యాంపును మూసివేసినట్లు చైనా ప్రకటించింది. పర్వతారోహణకు అనుమతి లేని వారికి ఈ నిషేధం వర్తిస్తుంది. ఎవరెస్ట్ పర్వతం వద్ద వ్యర్థ పదార్థాలు ఓ డంప్గా తయారయ్యాని, అందుకే విజిటర్స్ను అనుమతించడం లేదని చైనా అధికారులు చెబుతున్నారు. తాజా నిషేధం తర్వాత.. విజిటర్స్ ఎవరైనా 5200 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ వరకు వెళ్లవచ్చు. ఎక్కువ శాతం మంది టూరిస్టులు.. నేపాల్ నుంచి మౌంట్ ఎవరెస్ట్కు చేరుకుంటారు. అయితే ఇటీవల చైనా వైపు నుంచి ఎవరెస్ట్కు వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగింది. టిబెట్లో ఉన్న చైనా బేస్ క్యాంప్ను కారులో చేరుకోవచ్చు. కానీ నేపాల్ వైపు ఉన్న ఎవరెస్ట్ బేస్క్యాంప్ను చేరుకోవాలంటే రెండు వారాల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm