శ్రీనగర్: పుల్వామా దాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంసభ్యులకు వీలైనంత సహాయం చేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ అంశంపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. తమలో ఆత్మస్థయిర్యం తగ్గలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. అయితే జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్య భారీ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో.. కొంత కాలం వరకు సాధారణ పౌరుల ట్రాఫిక్ను నిలిపేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల పౌరులకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, దానికి క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. దాడిలో గాయపడి శ్రీనగర్లోని హాస్పటల్లో చికిత్స పొందుతున్న వారిని రాజ్నాథ్ పరామర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm