అమరావతి: అమరావతి పరిధిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది. వారి కోసం గాలింపు జరుగుతోంది. గత సోమవారం శ్రీనివాసరావుతో కలిసి మంగళగిరి పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి హత్యకు గురైంది. జ్యోతిని శ్రీనివాసరావే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆమె మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం చేయించారు. దీంతో పోలీసులకు అసలు నిందితుడెవరో అర్థమైపోయింది.
పోలీసుల విచారణలో జ్యోతిని చంపింది ఆమె ప్రియుడేనని తేలింది. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి మోసం చేసి శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని నిలదీయంతో పక్కా ప్లాన్తో హత్య చేశాడని నిర్ధారణ అయింది. దుండగుల దాడిలో జ్యోతి చనిపోయిందని నమ్మించేందుకే శ్రీనివాసరావు తలపై గాయం చేసుకున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును ఎస్పీ విజయరావు విచారించారు. జ్యోతి హత్య విషయంలో మరో ఇద్దరు స్నేహితుల ప్రమేయం ఉన్నట్టు తేలింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 15,2019 06:23PM