న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనతో యావద్దేశం భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు అఖిలక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటులోని లైబ్రరీలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ప్రకటించింది.
పుల్వామా ఘటనను అటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు ముక్తకంఠతో ఖండించాయి. రాజకీయాలకు తావులేకుండా దేశం యావత్తు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునివ్వగా, ఉగ్రవాదంపై చర్యలకు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో అంతా కలిసికట్టుగానే ఉన్నామన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 15,2019 06:34PM