ముంబయి: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) గురువారం ప్రారంభమైంది. అయితే పీఎస్ఎల్ ప్రారంభమైన మూడేళ్లకే ఎంతో ప్రాచుర్యం సంపాదించింది. ఐపీఎల్ మినహాయించి విదేశాల్లో జరిగే ఏ టీ20 లీగుల్లో టీమిండియా ఆటగాళ్లు ఆడటం లేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఇసాన్ మనీ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లను విదేశీ లీగుల్లో భాగం చేయాలంటూ బీసీసీఐని కోరారు. ఈ విధానంలో మార్పు రావాలని ఆయన కోరారు. 'బీసీసీఐ అమలు చేసే కొన్ని విధానాలు ఎంతో బాగుంటాయి. కానీ, విదేశాల లీగుల్లో టీమిండియా ఆటగాళ్లను ఆడించడం లేదు. ఈ విధానంలో మార్పులు రావాలి. విదేశాలకు చెందిన ఎందరో ఆటగాళ్లు భారత్కు వచ్చి ఆడుతున్నారు. అలాగే టీమిండియా ఆటగాళ్లు కూడా వెళ్తే బాగుంటుంది' అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm