హైదరాబాద్: నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడుతుంది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, యడవల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో వడగండ్ల వాన కురుస్తుంది. అకాల వర్షంతో పలు రకాల పంటలకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో గల పసుపు రాశులు తడిశాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. పలు వృక్షాలు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్లోని పసుపు, కందుల రాశులు నీటమునిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm