హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ నగరంలో సీఆర్పీఎఫ్, బీజేపీ ర్యాలీ నిర్వహించింది. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు సీఆర్పీఎఫ్ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా నాంపల్లి నుంచి గోషామహల్ మైదానం వరకు బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఆశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికై కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm