హైదరాబాద్: పాకిస్తాన్ కేంద్రంగా బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి దేశంలోకి నకిలీ కరెన్సీ అక్రమ రవాణాను హైదరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. దీనికి సంబంధించి ఇద్దరు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm