న్యూఢిల్లీ: పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్రంగా స్పందించాడు. పాకిస్థాన్తో ఇక మాటలు కట్టిపెట్టాలని, ఉగ్రవాద సమస్యకు యుద్ధమే సరైన పరిష్కారమని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. కబర్లు ఆపేసి యుద్ధానికి కదలాలని ప్రభుత్వానికి సూచించాడు. వేర్పాటు వాదులను ఉపేక్షించడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమువుతున్నాయన్న గంభీర్.. ఇక పాక్తో యుద్ధం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ఇప్పటికి జరిగింది చాలని, ఇకపై చర్చలు గదుల్లో కాకుండా యుద్ధ రంగంలో జరగాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
Mon Jan 19, 2015 06:51 pm