ఆదిలాబాద్: జిల్లాలోని దేవపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ట్రాలీ ఆటో బైక్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మృతుడు మావల పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్కానిస్టేబుల్ ప్రేమ్సింగ్గా గుర్తింపు.
Mon Jan 19, 2015 06:51 pm