ఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్టులను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం తెలిపింది. మార్చి 31లోగా ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులకు బోర్డు సూచించింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం ఆదాయ పన్ను రిటర్నులకు.. ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయ స్థానం ఫిబ్రవరి 6న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ను బ్యాంకు ఖాతాలకు, మొబైల్ ఫోన్లకు, పాఠశాల దరఖాస్తులకు అనుసంధానించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm