హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎప్పుడు లేని విధంగా రాజకీయాల్లో మతాన్ని జోడిస్తున్నారని, గెలుపోటములు కాంగ్రెస్కు కొత్త కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రజాసేవ తప్ప..రాజకీయ ప్రయోజనం ఆశించదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోందని, అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని రాహుల్ని ప్రధాని చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm