నాగ్పూర్: ఇరానీ కప్లో హనుమ విహారి విజృంభిస్తున్నాడు. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడుతున్నాడు. విదర్భ-రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెస్టాఫ్ ఇండియా పోరాడుతోంది. ఈ జట్టు తరఫున ఆడుతున్న హనుమ విహారి జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది ఇదే టోర్నీలో 183 పరుగులు చేసిన విహారి.. ఈ ఏడాది రెండు శతకాలు చేశాడు. దీంతో ఇరానీ కప్లో రెండు శతకాలు చేసిన ధావన్ రికార్డును విహారి అధిగమించి రికార్డు సృష్టించాడు. ఇరానీ కప్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో రెస్టాఫ్ ఇండియా 330 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విహారి 114 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 180 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రహానే తోడుగా ఆడిన విహారి ఒక్కో ఇన్నింగ్స్లో శతకం చేసిన వారి జాబితాలో విహారి కూడా నిలిచాడు.
Mon Jan 19, 2015 06:51 pm