ఢిల్లీ: ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో అమర జవాన్లకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో అమరులైన జవాన్ల భౌతికకాయాలను శుక్రవారం సాయంత్రం పాలెం విమానాశ్రయానికి తరలించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునీల్ లంబ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్సింగ్ రాఠోడ్ తదితరులు అమర జవాన్లకు నివాళులర్పించారు. అమర జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎంపీలు, మంత్రులకు ప్రధాని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm