విజయవాడ : అంగడి జ్యోతిని హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఉదయం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత-గిరిజన-ప్రజా సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం జ్యోతి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ.. డిజిపి ఆఫీసులో అర్జీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, గిరిజన సంఘాల మహా కూటమి రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాధం, ఎరుకుల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మా, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm