పాట్నా : ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండుతో సోమవారం బీహార్ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు భాయ్ వీరేంద్ర, లలిత్ యాదవ్ తమ స్థానాల నుంచి లేచి ప్రత్యేక పోస్కో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నితీష్ రాజీనామా చేయాలని డిమాండు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm