కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. పుల్వామాలో ఈనెల 14వ తేదీన జరిగిన ఉగ్రదాడి ఘటనపై మాట్లాడారు. ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉందని ఈనెల 8వ తేదీన ఇంటెలిజెన్స్ ముందస్తు హెచ్చరిక చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. దాడులు జరిగే సూచనలున్నాయన్న హెచ్చరికలున్నప్పటికీ ఒకేసారి 78 వాహనాల కాన్వాయ్ను ఎలా అనుమతించారని ఆమె అడిగారు. ఇంటెలిజెన్స్ నివేదికలను పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు దీదీ ఆరోపించారు. తన ఫోన్ను కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తున్నారని తనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నట్లు ఆమె తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm