న్యూ ఢిల్లీ :క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ముందస్తు బెయిల్ కోరాడు. నిందితుని అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. కానీ ఓ షరతు పెట్టింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో 50 మొక్కలు నాటి బెయిల్ తీసుకోవాలని ఆదేశించింది. నిందితుడు మొక్కలు నాటేలా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భరోసా ఇవ్వాలని, మొక్కలు నాటినట్లు దర్యాప్తు అధికారి కోర్టుకు నివేదించాలని న్యాయమూర్తి సునీల్ గౌర్ ఆదేశించారు. ఢిల్లీలోని చందర్ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పాతిక వేప, పాతిక రావి మొక్కలు రెండు వారాలలోగా నాటాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm