పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. కిరణ్ బేడీ సహాయనిరాకరణ చేస్తున్నారంటూ ఆమె నివాసం వెలుపల సీఎం చేస్తున్న బైఠాయింపు నిరసన సోమవారంతో ఆరో రోజుకు చేరుకుంది. కాగా, సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ముగ్గురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరిస్తుందని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm