శ్రీనగర్ : పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటనలో అమరులైన తమ తోటి జవానులను చూసి మనసు చలించి పోయిందని.. ఈ ఘటనలో తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన జవాను తెలిపారు. ఉగ్రదాడిపై ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వాహనానికి తమ వాహనం దాదాపు 500 మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. పేలుడు శబ్దం వినిపించగానే తామంతా అలర్ట్ అయ్యామని వెంటనే తమ బస్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు.
ఆ తరువాత కొంత సేపటికి తాము తిరిగి ఆ ప్రదేశానికి వచ్చామని.. అక్కడి పరిస్థితులను చూసి మనసు చలించిపోయి.. కన్నీళ్లాగలేదని చెప్పారు. ముఖాముఖి తలపడి ఉంటే సమాధానం చెప్పి ఉండేవాళ్లమని.. దొంగ దెబ్బ తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి వరకూ తమతోనే ఉన్న తమ సహచరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2019 07:02PM