మైదుకూరు: మార్క్ఫెడ్ అధికారులు ఉల్లి కొనుగోలు నిలిపివేయడంతో కెపీ రైతులు రోడ్డెక్కారు. పంటను రోడ్డుపై పారవేసి ధర్నా చేపట్టారు. దీనితో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా ఏఐకెఎస్ మరియు వైసిపి ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పెట్టుబడులు పెట్టి, గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కడం తోనే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. కొనుగోలు కేంద్రం అధికారులు కొనుగోలు ఆపేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నరాఉన్నారు. కొనుగోలు కేంద్ర ఆర్భాటంగా ప్రారంభించి మూసేయడం దారుణం అన్నారు. టీడీపీ నేతల మాటలు కేవలం నీటి మూటలు అయ్యాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. కూపన్లు ఇచ్చి ఇప్పుడు కొనుగోలు చేయము అంటే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు చేయాలని లేదంటే పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనిపై కలెక్టర్ ను కలుస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm