పంజాబ్ : పుల్వామా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న పంజాబ్మంత్రి నవజోత్సింగ్ సిద్ధూ ఎదురుదాడికి దిగారు. మరి కాందహార్ మాటేమిటి? అని కేంద్ర నాయకత్వాన్ని నిలదీశారు. ఇస్లామిక్ తీవ్రవాదులు ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు మళ్లించినప్పుడు మసూద్ అజర్ అనే ఉగ్రవాదిని అప్పటి ఎన్డీయే సర్కారు విడుదల చేసింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు. ఆ మసూదే తర్వాత జైషె మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పుల్వామాలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడి జైషె మహమ్మద్ పనే. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్థాన్ దేశాన్ని మొత్తంగా నిందించడం భావ్యం కాదని తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని సిద్ధూ సోమవారం మీడియాతో అన్నారు. అసలు సమస్య ఉగ్రవాదమని, అన్నిరూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండించాలని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm