చెన్నై: కశ్మీర్ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు నిర్వహించడం లేదని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్ రెండు దేశాల నేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో..కమల్హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇచ్చారు కమల్హాసన్. తన వ్యాఖ్యల్లో వేరే ఉద్దేశం ఏమి లేదని, కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని కమల్ చెప్పారు.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ..కశ్మీర్ పై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. రెండు దేశాల రాజకీయ నేతలు సరైన రీతిలో వ్యవహరిస్తే, మన సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరముండదని, ఎల్వోసీ మన ఆధీనంలోనే ఉంటుందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2019 08:38PM