న్యూడిల్లీ: ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టడంతో నిధుల కొరత తలెత్తకుండా ఆర్బీఐ ముందస్తుగా ప్రభుత్వానికి డివిడెండ్ను చెల్లించే అంశాన్ని పరిశీలిస్తోంది. దాదాపు రూ.28వేల కోట్ల మేరకు డివిడెండ్ను చెల్లించవచ్చు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్లో ఈ మధ్యంతర డివిడెండ్ను నిర్ణయిస్తుందని బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. నేడు బడ్జెట్, ఆర్థిక వ్యవస్థ దృక్కోణంపై ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శక్తికాంత దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే ఆర్బీఐ బోర్డు తన నిర్ణయాన్ని వెల్లడించవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm