ఇండోనేషియా : విమానంలో పాములను చూసుంటారు కదా. అది పాతదైంది. ఇప్పుడు నయా ట్రెండ్. విమానంలో తేళ్లు కూడా ప్రయాణిస్తున్నాయి. దానికి నిదర్శనమే ఈ ఘటన. ఇండోనేషియాలోని రియాయులో ఉన్న సుల్తాన్ సియారిఫ్ కాసిమ్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బాంటెన్లోని టాంగెరంగ్లో ఉన్న సొయికర్నో హట్టా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు లయన్ ఎయిర్ విమానం ఫిబ్రవరి 14న బయలు దేరింది. ఆ విమానంలోనే తేలు ప్రత్యక్షమైంది. సీటు మీద ఉండే లగేజ్ కంపార్ట్మెంట్లో ఓ ప్రయాణికుడు తేలును గమనించాడు.
దాన్ని చూసి భయపడి పోయాడు. మిగితా ప్రయాణికులు కూడా ఆ తేలును చూసి భయపడ్డారు. అది చిన్న తేలు అయితే ఎవరూ అంతలా భయపడేవాళ్లు కాదేమో. అది పెద్దగా ఉండటంతో అది ఎక్కడ తమ మీద పడుతుందోనని వణికిపోయారు. దాన్ని ఫోటోలు, వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు ఓ ప్యాసెంజర్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2019 09:09PM