హైదరాబాద్: తన తండ్రి దగ్గుబాటి రామానాయుడును చాలా మిస్ అవుతున్నానని అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రామానాయుడు వర్థంతి. ఈ నేపథ్యంలో కుమారుడు వెంకటేశ్, మనవడు రానా సోషల్మీడియా వేదికగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. మాకు ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం. ఎప్పటికీ మీ లోటు ఇలానే ఉంటుంది అంటూ వెంకటేశ్ తండ్రితో ఉన్న ఫొటోల్ని షేర్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm