ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు ఖరారైంది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఓ ప్రకటన చేశారు. ఈరోజు ససాయంత్రం ఫడ్నవీస్, బీజీేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్ తో కలిసి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. సీట్ల సర్దుబాటు విషయమై చర్చించారు. అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీలు ఓ ప్రకటన చేశాయి. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ, రానున్న లోక్ సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి అధికారంలో కొస్తుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm