హైదరాబాద్: రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.9 వేలు, అంతకు పైన ఉంటే రూ. 1000 ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు అదనం. ఇటీవల కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
'అన్నదాత సుఖీభవ' కింద తొలి విడత సొమ్మును సోమవారం రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నట్టుగానే తొలి విడత వెయ్యి రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేసింది. 48,89,277 మంది రైతుల ఖాతాల్లో రూ. 1000 చొప్పున మొత్తం రూ. 488.92 కోట్లు జమచేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నదాత సుఖీభవ పథకం వల్ల రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 19,2019 06:39AM