తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు మొత్తం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశదర్శనానికి కూడా మూడుగంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా... తిరుమల శ్రీవారిని నిన్న 75,418మంది భక్తులు దర్శించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm