హైదరాబాద్:ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 95 మందికి కూకట్పల్లిలోని 8-ఏ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. వీరిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 51 మందికి 3 నుంచి 23 రోజులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 36 మందికి 4 రోజులు జైలుశిక్ష, వాహనాల యజమానులకు రూ. 500 చొప్పన జరిమానా విధించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 8 మందికి 4 రోజులు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి దుర్గాప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm