హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీతో ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్న కేఏ పాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఆ పార్టీలో చేరి, కొన్నిరోజులకే దూరం జరిగిన టీవీ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేఏ పాల్ ఓ కామాంధుడని, అమ్మాయిలపై చేతులేసి తాకరాని చోట తాకుతుంటాడని అన్నారు. అనంతపురం పర్యటనలో తనతో ఓసారి ఇలాగే బిహేవ్ చేస్తే గట్టిగా హెచ్చరించానని వెల్లడించారు. అప్పట్నించి తనజోలికి రాలేదని, కానీ ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. తనకు హిందూపురం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ డబ్బులిస్తేనే టికెట్ అంటూ మెలిక పెట్టారని వాపోయారు శ్వేతారెడ్డి.
Mon Jan 19, 2015 06:51 pm