ముంబై: పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచులన్నీ నిషేధిం చాలంటూ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ చేస్తున్నది. ఫిబ్రవరి 14న పుల్వా మాలో దాడి జరిగిందని, ప్రపంచం అం తా పాకిస్తాన్పై దుమ్మెత్తి పోస్తోందని, అయినా ఇప్పటి వరకు ఈ ఘటనపై మా ట్లాడటానికి ఆ దేశ ప్రధానిగా ఉన్న ఇమ్రా న్ ఖాన్ ఎందుకు ముందుకు రాలేదని ప్ర శ్నించారు. ఈ దాడిపై ఇమ్రాన్ ఖాన్ సమా ధానం చెప్పాలని సీసీఐ డిమాండ్ చేసింది. భారత్ జవాన్లపై జరిగిన దాడిని మూకుమ్మడిగా ఖం డిస్తున్నాం అని, సీసీఐ క్రీడా రంగానికి చెందిందే అయినా తమకు దేశ ప్రయో జనాలే ముఖ్యం అని స్పష్టం చేశారు. ఆ తరువాతే క్రీడలు అని సీసీఐ స్పష్టం చేసింది. పాకిస్తాన్ హస్తం లేకపోతే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాలి అని, ఎందుకు మాట్లాడటం లేదో అర్థం అవుతోందని అన్నారు. ప్రధాని హోదాలో ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే ప్రపంచ కప్లో టీమిండియా.. పాకిస్తాన్తో ఆడకూడదని నిర్ణయించుకున్నట్టు సీసీఐ వివరించింది. ఈ మేరకు బీసీసీఐను కోరడం జరిగిందని సీసీఐ కార్యదర్శి సురేష్ ఖన్నా తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm