కంటోన్మెంట్: భారత ఆర్మీ మార్చి 30న రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ పౌరసంబంధాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్(ఏవోసీ) సెంటర్లో నిర్వహించనున్న ర్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పుదిచ్ఛేరి(యూటీ)లకు చెందిన అభ్యర్థులు సోల్జర్స్(ఫార్మా) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఔత్సహికులైన అభ్యర్థులు ఆన్లైన్ (www.joinindianarmy.nic.in) లో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 22వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. మార్చి 23 నుంచి అడ్మిట్ కార్డులను (www.joinindianarmy.nic.in) వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm