అమరావతి: తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన విమర్శలు చేశారు. ఈ ఉదయం అమరావతి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, జగన్ తో కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన లక్ష్యమని నిప్పులు చెరిగారు.
దేశ భద్రత విషయంలో టీడీపీ రాజీపడబోదని వెల్లడించిన ఆయన, రాజకీయ లాభం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మోదీ ఏ అరాచకం చేయడానికైనా సమర్ధుడేనని, గోద్రాలో ఆయన హయాంలో సాగిన నరమేధంలో 2 వేల మంది మరణించిన విషయాన్ని తాను ఎన్నడూ మరువబోనని అన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అస్థిరంగా ఉండటం వృద్ధి విఘాతమని వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీజేపీ రాజకీయాల కారణంగానే జమ్ము కాశ్మీర్ లో సంక్షోభం ఏర్పడిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 19,2019 10:15AM