నోయిడా: ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జానీ నోయిడాలోని తన హోటల్ ముందు 'కశ్మీరీ నాట్ అలౌడ్' అనే బోర్డు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహం ధ్వంసం, జెఎన్యూ విద్యార్థినేతపై దాడికి ప్లానింగ్ చేసిన ఉదంతంలోనూ అమిత్ జానీ హస్తముందనే ఆరోపణలున్నాయి. తాజాగా అమిత్ జానీ... పుల్వామా ఉగ్రదాడి అనంతరం తన సొంత హోటల్ ముందు కశ్మీరీయులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. ఈ సందర్భంగా అమిత్ జానీ మాట్లాడుతూ ఈ హోటల్కు వచ్చే వ్యక్తులను ఈనాటి వరకూ చెక్ చేయలేదని అన్నారు. అయితే పుల్వామా దాడి అనంతరం భద్రత కోసమే ఈ కొత్త బోర్డు పెట్టామన్నారు. కశ్మీరీయులు హోటల్లోకి ప్రవేశించేందుకు అనుమతినివ్వమని తేల్చిచెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm