లండన్ : సామాజిక మాధ్యమం ఫేస్బుక్ డిజిటల్ గూండాలా వ్యవహరిస్తుందని బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించింది. డేటా లీక్పై 18 నెలల విచారణ తరువాత నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎఫ్బి పై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. గతంలో నకిలీ వార్తలను ఫేస్బుక్ వ్యాప్తి చెందిస్తుందని.. ఆ సంస్థ సిఇఒ మార్క్ జాకర్బర్గ్ కి బ్రిటన్ ప్రభుత్వం నోటీసులు పంపింది. దీనిపై స్పందించకుండా ధిక్కారానికి పాల్పడ్డారని బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm