ప్రకాశం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొణిజేటి చేనేతపురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. ఈమధ్యనే టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నేత పాలేటి రామారావు వర్గాల మధ్య ఘర్షణ మొదలై కర్రలతో దాడులు చేసుకున్నారు. పాలేటి రామారావు ప్రజాసమస్యలపై సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో ఆమంచి వర్గం గందరగోళం సృష్టించడంతో ఘర్షణ మొదలై రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలవగా చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm