న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం దేశంలోని కశ్మీరీలకు తగిన భద్రత కల్పించాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ కోరినప్పటికీ ఇందుకు భిన్నంగా మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీ వస్తువులను బహిష్కరించాలని, ప్రజలెవరూ కశ్మీర్ వెళ్లొద్దని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ సంచలనమవుతోంది.
'ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఒకరు ఈ అప్పీలు చేశారు. కశ్మీర్ పర్యటించొద్దు. వచ్చే రెండేళ్లు అమర్నాథ్ వెళ్లొద్దు. ప్రతీ శీతాకాలంలోనూ కశ్మీరీ వ్యాపారులు నుంచి వచ్చే వస్తువులు కొనవద్దు. కశ్మీరీలకు సంబంధించిన ప్రతీదీ బహిష్కరించండి' అని తథాగత్ రాయ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీన్ని తాను అంగీకరిస్తున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, గవర్నర్ స్పందనపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన మరో ట్వీట్లో వివరణ ఇచ్చారు. ఒక రిటైర్డ్ కల్నల్ నుంచి వచ్చిన సూచన అదని అన్నారు. కాగా, అంతకముందు శివసేన ఎమ్మెల్యే, ప్రతినిధి మనీష్ కయాండే సైతం 'కశ్మీరీ టూరిజాన్ని మన ఇండియన్లు, టూర్ కంపెనీలు రెండేళ్లు బహిష్కరించాలి' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 19,2019 04:11PM