లక్నో : వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలు చేసారని మోడీ అన్నారు. ఈ పాజెక్టులో పాల్గొన్న ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను అవమానించారని ప్రధాని విమర్శించారు. సెమీ హై స్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకొని కొందరు ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. వారు ఇలా చేయడం దురదృష్టకరమని , ఇది ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను అవమానించడమేనని మోడీ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm