హైదరాబాద్ : రాజకీయ వివాదంగా మారిన కొండవీడు రైతు ఆత్మహత్య ఘటనపై గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు స్పందించారు. రైతు ఆత్మహత్యకు అసలు పోలీసులకు సంబంధమే లేదని.. దుష్ప్రచారం తగదన్నారు. సీఎం సభ కోసం రైతు కోటయ్య అనుమతితోనే అతని స్థలంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకున్నామని, సీఎం సభకు 4 గంటల ముందే కోటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రైతులు కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని.. అసలు కోటయ్య ఆత్మహత్యకు పోలీసులకు సంబంధం లేదన్నారు. పోలీసుల అత్మవిస్వాసం దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బొప్పాయి పళ్ళు తింటే అడిగినందుకు పోలీసులు కొట్టి చంపారని ప్రచారం చేయడం దారుణంగా ఉందన్న ఎస్పీ రైతు ఎందుకు చనిపోయాడో విచారణ చేస్తున్నామని, ఘటనపై నరసరావుపేట డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారన్నారు. హెలిపాడ్ కు, రైతు స్థలానికి చాలా దూరం ఉందని, సీఎంపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని.. సీఎం మానవత్వంతో పరిహారం ప్రకటించారని, వదంతులు సృష్టించడం మంచిది కాదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm