హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున.. వైసీపీ అధినేత జగన్ను కలిశారు. గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నాగార్జున చాలా కాలంగా జగన్తో సన్నిహితంగా ఉంటున్నారు. ప్రారంభం నుంచి నాగార్జున రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం నాగార్జున-జగన్ భేటీపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. భేటీ ముగిసిన అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm