ఛత్తీస్గఢ్: నారాయణపూర్ జిల్లాలో రేషన్ డీలర్ హత్యకు గురయ్యాడు. రేషన్ డీలర్ బుధరామ్ను మావోయిస్టులు తుపాకీతో కాల్చి చంపారు. మూడు రౌండ్లు కాల్చడంతో బుధరామ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm