న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో పాకిస్థాన్ వ్యక్తుల హస్తం ఉందనడానికి ఆధారాలు ఉంటే ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సీరియస్ అయ్యారు. డియర్ ఇమ్రాన్ఖాన్, ఈ దాడి కి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్థాన్లోని బహావల్పూర్లోనే ఉన్నాడు. ఐఎస్ఐ సాయంతో దాడులకు కుట్ర పన్నుతున్నాడు. ముందు అతన్ని పట్టుకోండి. మీకు చేతగాకపోతే మాకు చెప్పండి.. మేం పట్టుకుంటాం. అయినా ముంబై దాడి ఆధారాలు ఇచ్చాం కదా.. మరి దాని సంగతేమైంది అని అమరీందర్ ట్వీట్ చేశారు. పుల్వామా దాడి పాకిస్థాన్ పనే అని ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలు కూడా అంగీకరించాయి. ఇండియాకు మద్దతుగా నిలిచాయి. దీంతో డిఫెన్స్లో పడిపోయిన ఇమ్రాన్.. మంగళవారం మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. అసలు ఈ దాడితో తమకేమీ సంబంధం లేదని, ఆధారాలు ఉంటే ఇవ్వండి.. విచారణ జరిపిస్తాం అని ఏవో కొన్ని రొటీన్ డైలాగులు కొట్టారు. పైగా భారత్ యుద్ధానికి వస్తే తాము తిప్పికొడతాం అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm