న్యూఢిల్లీ: కేవలం తన వల్ల మాత్రమే అద్భుతం జరుగుతుందని ఆశించవద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసినప్పుడే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తూర్పు యూపీ బాధ్యతలను చేపట్టిన ఆమె నిన్న బుందేల్ఖండ్ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన పలు విషయాలను కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ జైన్ ఆదిత్య వెల్లడించారు. కేవలం తన వల్ల మాత్రమే అద్భుతం జరుగుతుందని ఆశించవద్దని ప్రియాంక పేర్కొన్నట్టు ఆయన వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm