తిరుమల:తిరుమల తిరుపతి దేవస్థానం పలుకీలక నిర్ణయాలు తీసుకుంది. 2019-20 సంవత్సరానికి 3116 కోట్ల అంచనాతో బడ్జేట్ ఆమోదం పొందిందని చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలుపగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. శ్రీవారి భక్తులు దాహర్తిని తీర్చడానికి కళ్యాణి డ్యాం నుండి 8.5 కోట్లుతో రోండోవ పైపు లైను నిర్మాణం, 12.5 కోట్ల రూపాయల వ్యయంతో పాంచజన్యం అతిధి గృహం వద్ద అదనపు వంటగది నిర్మాణం, 47.44 కోట్లు రూపాయలు వ్యయంతో బి టైప్ క్వార్టర్ వద్ద యాత్రికులు వసతి సముదాయం నిర్మాణంకు ఆమోదం తెలిపామన్నారు. 4.95 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి అతిథి గృహం వద్ద వంటశాల నిర్మాణంకు ఆమోదం, తిరుమలలో కాటేజిల నిర్వహణకు 85 కోట్లు కేటాయింపు, తిరుపతిలో కాటేజిల నిర్వహణకు 17.5 కోట్లు కేటాయించామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm