లక్నో : ప్రధాని నరేంద్రమోడీ త్వరలో ఉత్తర్ప్రదేశ్లోని అమేథిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27న నరేంద్రమోడీ అమేథిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ నేత ఒకరు మంగళవారం తెలిపారు. మున్షిగంజ్లో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని మోడీ సందర్శిస్తారని.. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అమేథి లోక్సభ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రాజేశ్ అగ్రహారి తెలిపారు. 2014(లోక్సభ)లో అమేథిలో రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా లక్ష ఓట్ల తేడాతో బీజేపీ నేత స్మృతి ఇరానీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm