కృష్ణా: విజయవాడలో భర్త హత్యకు అతని భార్యే కుట్రపన్నింది. ఇంట్లో నిద్రపోతున్న భర్తపై వేడినీళ్లు పోసి చంపేందుకు భార్య యత్నించింది. వేడినీళ్లు పడటంతో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణ హైదరాబాద్లో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తుండగా.. నిందితురాలు విజయవాడలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. భర్తను చంపేందుకు భార్య యత్నించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గాయాలపాలైన బాధితుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm