న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పుల్వామాలో జవాన్లపై దాడి ఘటన నేపథ్యంలో.. అంతర్గత భద్రత, కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, భారత్-పాక్ సరిహద్దు వెంబడి భద్రత, బలగాల తరలింపుపై రాజ్నాథ్ సింగ్ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ, భద్రతాదళాల ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శితోపాటు జాతీయ భద్రతాసలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ డీజీ పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm