హైదరాబాద్ : పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో..దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఛత్తీస్గఢ్కు చెందిన పెయింటింగ్ కళాకారుడు వినోద్ పాండా తన కళతో పుల్వామా దాడిపై నిరసన తెలియజేశాడు. రాయ్పూర్లోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారిపై పాకిస్థాన్ జెండా పెయింటింగ్ వేశాడు. పాకిస్థాన్ నశించాలని రోడ్డుపై రాసి నిరసన తెలియజేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm