హైదరాబాద్ : పుల్వామా దాడిలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడంపై భారత్ వెంటనే స్పందించింది. పాకిస్థాన్ ప్రధానిగా ఎవరున్నా భారత్ లో దాడి జరిగినప్పుడు ఇలాగే వ్యాఖ్యానిస్తుంటారని, ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ప్రకటనలు తమకేమీ ఆశ్చర్యం కలిగించడంలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. పుల్వామా దాడిపై మా పాత్ర ఉందని భావిస్తే ఆధారాలు చూపించాలి, భారత్ యుద్ధాన్నే కోరుకుంటే అందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉంది అంటూ ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి భారత్ కూడా అదే మోతాదులో బదులిచ్చింది.
పుల్వామాలో భారత జవాన్లపై దాడిని పాక్ ప్రధాని ఖండించకపోవడం, ఇది టెర్రరిస్టుల దుశ్చర్య అని పేర్కొనకపోవడం తమకేమీ ఆశ్యర్యకరంగా అనిపించలేదని భారత వర్గాలు వ్యంగ్యం ప్రదర్శించాయి. పాక్ ప్రధాని పుల్వామా ఆత్మాహుతి దాడిని ఖండించడం కానీ, అమరజవాన్ల కుటుంబాలకు సంతాపం తెలియజేయడం కానీ చేయలేదని విమర్శించాయి. తీవ్రవాదానికి పాకిస్థాన్ ఆయువుపట్టు అని ఆరోపిస్తూ ఉగ్రవాదులపై ప్రత్యక్ష చర్యలకు దిగాల్సిందేని భారత విదేశీ వ్యవహారాల శాఖ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యం అమలులో భారత్ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా ఉందని, ఈ విషయాన్ని పాకిస్థాన్ ఎన్నటికీ అర్థం చేసుకోలేదని దుయ్యబట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 19,2019 08:09PM